దెందులూరు మండలం కొమిరేపల్లికి చెందిన కౌలు రైతు కాలి ఏసుపాదం(65) పశువుల మేత కోసం ఆదివారం పొలం వెళ్లాడు. మూర్ఛ వ్యాధితో కొట్టుమిట్టాడుతూ పక్కనే వున్న పంట కాలువలో పడి చనిపోయాడు. స్థానిక రైతులు గుర్తించి పోలీసులకు, వైద్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి శవ పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రిపోర్టు వస్తే మరణం పై స్పష్టత వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఏసుపాదం మృతితో గ్రామంలో అలజడి రేగింది. బిక్కుబిక్కుమంటూ ఉంటున్న ప్రజలకు ఈ వార్త మరింత భయాందోళనలు కలిగిస్తోంది. గ్రామంలో ఇప్పటి వరకు 29 కేసులు నమోదు కాగా, ఆదివారం మూర్చతో ఒక రైతు మృతి చెందగా, మరో మహిళ కళ్లు తిరిగి పడిపోవడంతో మొత్తం కేసుల సంఖ్య 31కు చేరింది. బాధితులసంఖ్య క్రమేపీ పెరుగు తూండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో ఎక్కువ మందికి వంకాయ కూర తినడం వల్ల వచ్చిందని చర్చ నడుస్తోంది. కూరగాయల సాగులో పురుగు మందులు వాడి ఉండటం.. కూర వండేటప్పుడు వంకాయలను సరిగా శుభ్రం చేయకపోవడం వల్లే ఇది జరిగి ఉండవచ్చని గ్రామస్థులు భావిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అంతు చిక్కని వ్యాధికి కచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియజేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. భీమడోలు, పూళ్ల గ్రామాల్లో మరో రెండు కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 38కి చేరింది. శుక్రవారం కేసులు నమోదు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వైద్యులు కొత్త కేసులు రావడంతో కలకలం రేగింది. భీమడోలు బీసీ కాలనీకి చెందిన బి.రాంబాబు ఉదయం పొలం పనులకు వెళ్లి ఫిట్స్తో కుప్ప కూలిపోయాడు. తోటి కూలీలు భీమడోలు సామాజిక వైద్యశాలకు తరలించగా ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్య చికిత్సకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూళ్లలో 30 ఏళ్ల గర్భిణీ ప్రమీల మధ్యాహ్నం వంట చేస్తుండగా ఫిట్స్ వచ్చి సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను పూళ్ల వైద్య కేంద్రానికి తరలించగా చికిత్స చేసి కోలుకున్న తరువాత డిశ్చార్జి చేసినట్లు వైద్యులు లీలా ప్రసాద్ తెలిపారు.
ముఖ్యనేతలు, అధికారులతో సీఎం జగన్ అత్యవసర భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీకి డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏజీ శ్రీరామ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎస్ఈసీకి సహకరించడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ స్వల్పంగా మారింది. పంచాయతీ ఎన్నికలు వద్దంటూ ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తొలి విడత ఎన్నికల ప్రక్రియకు ఆలస్యం అయింది. దీంతో మొదటి విడత ఎన్నికలను నాలుగో విడతగా మార్చి అందుకు కొత్త తేదీని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 21న నాలుగో విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలను ఒకటి, రెండు, మూడు విడతలుగా మార్చి వాటిని యథాతథంగా జరపనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. మారిన షెడ్యూల్ ప్రకారం తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 7న, రెండో విడత ఫిబ్రవరి 13న, మూడో విడత ఫిబ్రవరి 17, నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనున్నాయి.
మండలంలో ఆలయాలపై ఎటువంటి దాడులు జరగకుండా గ్రామ సంరక్షక దళాలు చూడాలని పాడేరు డీఎస్పీ డాక్టర్ వీబీ.రాజ్కమల్ అన్నారు. శనివారం ఆయన స్థానిక పోలీస్స్టేషన్లో గ్రామ సంరక్షక దళాల సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పరిధిలోని గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించాలని, అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై నిఘా పెట్టాలన్నారు. అంతకుముందు డీఎస్పీ మండలంలో పరిస్థితులపై ఎస్ఐ పాపినాయుడుని అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో సీఐ పీపీ.నాయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఓ వైపు చర్చలు జరుగుతుండగానే సిక్కింలో భారత, చైనా దళాల మధ్య మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. మూడు రోజుల క్రితం సిక్కింలోని నాతులా ప్రదేశం గుండా చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను భారత బలగాలు దీటుగా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. చైనా సైనికులను అడ్డుకునే ప్రయత్నంలోనే ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో నలుగురు భారత జవాన్లు గాయపడగా, చైనా సైనికులు 20 మంది గాయాలపాలయ్యారు. అయితే ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని, పరిస్థితి మాత్రం పూర్తి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెడుతున్నా సరే... సరిహద్దుల్లో సమర్థవంతంగా సైనికులు తమ విధి నిర్వహణలో నిమగ్నమయ్యారని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
ఏపీ పంచాయతీ ఎన్నికలకు సుప్రీం కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేశ్ రాయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. రాజ్యాంగ విచ్ఛిన్నాన్ని అంగీకరించమని ధర్మాసనం తేల్చి చెప్పింది. వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని పేర్కొంది. ఉద్యోగ సంఘాలు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయంలో జోక్యం చేసుకోమని తెలిపింది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జోక్యం మంచిది కాదని, రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధమని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగట్లేదా అన్న ధర్మాసనం.. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని పేర్కొంది. కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు కావాలని కోరిన విషయాన్ని జస్టిస్ కౌల్ ప్రస్తావించారు. ఈసీని తప్పుబడుతూ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారన్నారు. ఎస్ఈసీ సమావేశానికి ఉద్యోగ సంఘాలు ఎందుకు హాజరు కాలేదని జస్టిస్ కౌల్ ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో మధ్యాహ్నం ప్రారంభమైన విచారణ ఇంకా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ పిటిషన్కు ముందే ఎస్ఈసీ కేవియట్ దాఖలు చేసింది. విచారణలో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరింది.
"2016 నవంబర్ 8, రాత్రి 8".. దేశ ప్రజలు ఎప్పుడూ మర్చిపోని సమయం ఇది. దేశంలో చెలామణిలో ఉన్న పెద్ద నోట్లైన 1,000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ సమయంలో ప్రకటించారు. నోట్ల రద్దు అంశంలో ప్రభుత్వ ఉద్దేశం ఏదైనా, దాని అమలులో జరిగిన తప్పిదాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటునే ఉంది. తాజాగా చిన్న నోట్లు రద్దు చేస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 100, 10, 5 రూపాయల పాత నోట్లను రద్దు చేయబోతున్నారని, ఎవరి వద్దైనా ఆ నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో మార్చుకోవాలంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పెద్ద నోట్ల రద్దుతో ఎదురైన అనుభవంతో ఈ ప్రచారంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయమేదైనా తీసుకుంటే తమ పరిస్థితి ఎలా ఉండనుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇదంతా తప్పుడు ప్రచారమని, ఇలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని భారతీయ రిజర్వ్ బ్యాంకు సోమవారం ప్రకటించింది. ఈ విషయమై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ కొన్ని మీడియా సంస్థల్లో ఈ విషయమై తప్పుడు కథనాలు వెలువడ్డాయని వాటిని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. సమీప భవిష్యత్లో నోట్ల రద్దు లాంటి ఆలోచనలేమీ లేవని, ప్రభుత్వం నుంచి కానీ ఆర్బీఐ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకుండా ఏదీ నమ్మవద్దని కోరింది.
టెలికాం రంగంలో మరో సంచలనానికి ముకేశ్ అంబానీ నిర్వహణలోని రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. రూ. 5,000 కంటే తక్కువ ధరలో 5జీ స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రారంభంలో 5జీ ఫోన్ ధర రూ.5,000 వరకు పెట్టి నా ఉత్పత్తి, అమ్మకాలు పెరిగే కొద్దీ ధర రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య ఉం టుందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని కంపెనీ అధికార వర్గా లు చెప్పాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో 5జీ టెలికాం సేవలను సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ల కనీస ధర రూ.27,000 నుంచి ప్రారంభమవుతోంది. 4జీ సేవలు ప్రారంభమైనా దేశంలో ఇంకా దాదాపు 35 కోట్ల మంది 2జీ ఫీచర్ ఫోన్లే వినియోగిస్తున్నారు. తక్కువ ధరలో 5జీ స్మార్ట్ఫోన్ ద్వారా వీరిలో కనీసం 20 నుంచి 30 కోట్ల మందిని ఆకర్షించవచ్చని జియో భావిస్తోంది. 4జీ సేవల కోసమూ రిలయన్స్ జియో ఇదే వ్యూహాన్ని అనుసరించింది. మిగతా కంపెనీలన్నీ 2జీ సేవల నెట్వర్క్ విస్తరణపై దృష్టి పెడితే, జియో మాత్రం రిఫండబుల్ డిపాజిట్తో రూ.1,500కే 4జీ ఫోన్ను మార్కెట్లో విడుదల చేసి కోట్ల మంది ఖాతాదారుల్ని సంపాదించింది. ఇపుడు 5జీ స్మార్ట్ఫోన్ విషయంలోనూ ఇదే వ్మూహం అనుసరించాలని కంపెనీ భావిస్తోంది. భారత్ను త్వరలోనే 2జీ విముక్త దేశంగా తీర్చిదిద్దాలని ఆశిస్తున్నట్టు ముకేశ్ అంబానీ గత ఏడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎంలో ప్రకటించారు. దీనికి తోడు ఇటీవల ఫేస్బుక్, గూగుల్, అనేక పీఈ సంస్థలు రిలయన్స్ జియో ప్లాట్ఫాంలో దాదాపు రూ.1.54 లక్షల కోట్లు పెట్టుబడులు కుమ్మరించాయి. ఈ నిధుల్లో కొంత భాగాన్ని 5జీ ఫోన్ల కోసం వినియోగించాలని ముకేశ్ అంబానీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
మా దగ్గర మీరు కొన్న ఫోన్ చెడిపోతే మీరు మా దగ్గరకు రావాల్సిన అవసరం లేదు. సమాచారం ఇస్తే మేమే మీ ఇంటికి వచ్చి ఫోన్ను పరిశీలిస్తాం... అది రిపేర్ కావడానికి సమయం పడితే రిపేర్ అయ్యేవరకు ఒక ఫోన్ వాడుకోవడానికి ఇస్తామంటూ చిన్న సెల్షాపులు, షోరూంలు ఈ వారం నుంచి ప్రచారం ప్రారంభించాయి. సెల్ చెడిపోతే అప్పటివరకు ఫోన్ సేవలకు అవాంతరం అవుతుందని, అందువలన వినియోగదారులకు అంతరాయాలు లేకుండా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే పెద్ద షోరూంలలో ఈ సదుపాయం లేదు. చిన్న షాపుల వారు మాత్రమే ఈ ఆఫర్లు పెట్టారు. పెద్ద షో రూంలలో ధరల తగ్గింపు ప్రభా వాన్ని తట్టు కోవడానికే ఈ ఆఫర్లు ప్రకటించారు. దీంతో వినియోగ దారులతో నేరుగా సంబంధాలు ఏర్పర్చుకొని వారిని సంతృప్తిని పరచడం ద్వారా వ్యాపార విస్తృతి కోసం దీనిని ప్రకటిస్తున్నారు.
అనకాపల్లి: ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో బెల్లం ధరలు రోజు రోజుకి పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 8వ తేదీన ఒకటోరకం వంద కిలోలు రూ.3110 పలకగా మధ్యరకం రూ. 2770లకు పలికింది. నల్లబెల్లం రూ.2520లకు పలికాయి. 10న ఒకటోరకం రూ.3060, మధ్యరకం రూ.2740, నల్లబెల్లం రూ. 2490లకు పడిపోయింది. మంగళవారం ఒకటో రకం రూ.3000లకు పడిపోగా మధ్యరకం రూ. 2710కి తగ్గిపోయింది. నల్లబెల్లం రూ.2530కి పెరిగింది. వాస్తవానికి ఒకటో రకం బెల్లం దిమ్మలు తక్కువగా వస్తుంటాయి. దాని తరువాత రకాన్నే ప్రమాణికంగా తీసుకోవాలి. ఆతరువాత రకమైతే రూ.2860లకు పలికినట్టు వర్తకులు చెబుతున్నారు. ఇతర మార్కెట్ల్లో ధరలు తక్కువగా ఉండడంతో వాటి ప్రభావం అనకాపల్లి మార్కెట్పై కూడా పడుతుందని వర్తకులు చెప్పారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక బెల్లాలు ఇతర రాష్ట్ర వర్తకులకు రవాణాతో సహా కలుపుకొని తక్కువ రేటుకు అమ్మకాలు చేయడంతో అనకాపల్లి మార్కెట్కు ఆర్డర్లు తగ్గుతున్నాయని వర్తకులు తెలిపారు. సంక్రాంతి పండుగ సమయంలో బెల్లం ధరలు పడిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా చెరకు పంటకు తెగుళ్లు సోకి ఆర్థికంగా నష్టపోతున్న సమయంలోనైనా రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులను ఆదుకుంటే బాగుంటుందని పలువురు అంటున్నారు. రాష్ట్ర ప్రభు త్వం క్రిస్మస్, సంక్రాంతి పండుగల పర్వదినం సందర్భంగా ఇచ్చే చంద్రన్న కానుకకు అనకాపల్లి బెల్లా న్ని కొనుగోలు చేసి ఉంటే రైతులకు కొంతైనా గిట్టుబాటు ధర లభించేదని చెరకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు తెలిపారు.
బియ్యం కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా గుర్తిస్తున్నాం’... అంటూ రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు తొలిఫైలుపై సంతకం పెట్టారు! ‘అబ్బో ఎంత చక్కని నిర్ణయమో’ అని అంతా అనుకున్నారు. అసలు విషయమేమిటంటే... ఇది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయానికి నకలు మాత్రమే! కాకపోతే... అప్పట్లో తెల్ల రేషన్ కార్డు అని ఉండేది. ఇప్పుడు దానిని ‘బియ్యం కార్డు’గా మార్చారు. మరికొన్ని పదాల్లో మార్పులు మాత్రమే జరిగాయి! దీనిపైనా ఎవరికైనా సందేహముంటే... చంద్రబాబు హయాంలో రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి హోదాలో ఉండి ఈ జీవో జారీ చేసిన, ఇప్పుడు ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా ఉన్న అజేయ కల్లంనే అడగొచ్చు! సహజంగా కొత్త శాఖ బాధ్యతలు స్వీకరించిన మంత్రులు... సరికొత్త నిర్ణయాలపై సంతకాలు పెడతారు. కానీ, ధర్మాన కృష్ణదాసు చేత పాత నిర్ణయాన్నే కొత్తగా ‘పునరుద్ఘాటించారు’. రేషన్ కార్డును ఆదాయ ధ్రువపత్రంగా పరిగణించాలని చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబరు 186 జారీ చేసింది. అనేక అధికారిక సంప్రదింపులు, శాఖలతో మాట్లాడిన తర్వాత 2015 మే 26న ఈ జీవో ఇచ్చారు. దీని ప్రకారం పేదల వద్ద ఉండే రేషన్ కార్డునే ఆదాయ ధ్రువపత్రంగా పరిగణించాలి. రేషన్కార్డు లేని వారికి స్వీయ ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా నాలుగేళ్ల కాల వ్యవధితో కొత్తగా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ చేయాలని ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రభుత్వ, పైవేటు సంస్థలు, కార్పొరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు చేసే విభాగాలు, బ్యాంకులు, ఉద్యోగ సంస్థలు ఎలాంటి నిబంధనలు పాటించాలో అందులోనే సవివరంగా చెప్పారు. ఇది ఇచ్చిన రెండేళ్ల తర్వాత సర్కారు మరో జీవో 229 జారీ చేసింది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ ఈ జీవోను జారీ చేశారు. 186 జీవోను ట్రూస్పిరిట్తో అమలు చేయడం లేదని, ఇంకా అనేక శాఖలు, విభాగాలు ఆ జీవో సారాంశాన్ని అర్థం చేసుకోలేదని అందులో తెలిపారు. పాత జీవోలో ఒక్క పదం కూడా మార్చకుండా ‘రేషన్ కార్డే పేదలకు ఇన్కమ్ సర్టిఫికెట్’ అని పునరుద్ఘాటించారు. దీనిని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. వెరసి... రేషన్ కార్డును ఆదాయ ధ్రువీకరణ పత్రంగా గుర్తించాలని చంద్రబాబు హయాంలోనే రెండు జీవోలు జారీ అయ్యాయి. సరిగ్గా మూడేళ్ల తర్వాత, ఇదే అంశంపై జగన్ సర్కారు జీవో 205ను జారీ చేసింది. గతంలో ఇచ్చిన 186, 229 జీవోలను తొక్కిపెడుతూ ఇదే ఫ్రెష్ అనేలా కలరింగ్ ఇచ్చారు. ఇందులో మారింది రెండే అంశాలు! ఒకటి... రేషన్కార్డు స్థానంలో బియ్యం కార్డు అని పెట్టారు. రెండు... ‘‘ప్రజలు తమ విలువైన సమయం, పనులను మానుకొని ఇన్కమ్ సర్టిఫికెట్ల కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా చేస్తున్నాం’’ అని జీవో 186లో పేర్కొనగా... ‘‘ఇన్కమ్ సర్టిఫికెట్ల జారీ అతిపెద్ద పనిగా మారింది. రెవెన్యూ యంత్రాంగం శక్తి అంతా దానికే డైవర్ట్ అవుతోంది. అందుకే బియ్యం కార్డే ఇన్కమ్ సర్టిఫికెట్గా ఇస్తున్నాం’’ అని కొత్త జీవోలో రాసుకొచ్చారు. ఇక మిగిలిన అంశాలన్నీ సేమ్ టు సేమ్. గతంలో ఇచ్చిన జీవోలు ట్రూ స్పిరిట్తో అమలుకాలేదన్న అంశాన్ని కూడా ఇందులో పునరుద్ఘాటించారు.
శిశుపాలుడి మాదిరి తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి మండిపడ్డారు. ఇంతకాలం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉందని విర్రవీగిన పోయిన కేసీఆర్... త్వరలో తెలంగాణ ప్రజల తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. తాజా పరిణామాలను చూస్తుంటే ఇదే అర్థం అవుతోందన్నారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కేసీఆర్... కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందని వ్యాఖ్యానించారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం దాన్ని అవహేళన చేశారన్నారు. కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే.. వాటి యాజమాన్యంపై కేసీఆర్ శాపనార్థాలు పెట్టారని గుర్తు చేశారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టినా... సీఎం దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఇక పరిస్థితి చేయి దాటి పోతుందని గ్రహించి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకుంటే... దానిని కూడా సీఎం అడ్డుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అన్న విమర్శలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన కారణంగా, గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని తెలంగాణ ప్రజలు సైతం స్వాగతిస్తున్నారన్నారు. ఈ విషయంలో అనవసర రాద్ధాంతం చేయడం కంటే, సీఎం కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం మేలన్నారు. లేనిపక్షంలో తెలంగాణ సమాజ ఆగ్రహ జ్వాలలు తారస్థాయికి చేరుతాయనడంలో సందేహం లేదని విజయశాంతి అన్నారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకే టీడీపీ నేతలు, చంద్రబాబు విశాఖను పరిపాలనా రాజధాని కాకుండా అడ్డుకుంటున్నారని పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆరోపించారు. అన్ని పార్టీల్లోనూ చంద్రబాబు మనుషులు ఉండడంతో అమరావతిపై ఆయనకు మద్దతుగా కొంతమందితో మాట్లాడిస్తున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో రాజధాని వద్దని ఆయన అనుకుంటే దీనిపై రిఫరెండం నిర్వహించాలని.. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కావాలని కోరితే ఈ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించేందుకు సిద్దమేనా అని సవాల్ విసిరారు. ఐదేళ్లలో చంద్రబాబు రాజధానిలో ఏ పని పూర్తిచేయలేదని విమర్శించారు. అమరావతిపైనా, అక్కడి రైతులు, ప్రజలపైనా సీఎం జగన్కు ఎలాంటి కక్ష లేదని చెప్పారు. విశాఖ కేంద్రంగా ప్రకటించిన రైల్వేజోన్ ఏర్పాటు పనుల ప్రారంభంపై రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జగన్ 2022 తర్వాత ముఖ్యమంత్రిగా ఉండరని మాజీ ఎంపీ సబ్బం హరి అంటున్నారని.. ఆయన జోస్యం చెబుతున్నారా.. లేక చంద్రబాబుతో కలిసి ఏదైనా కుట్ర పన్నుతున్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
*సలహా అనేది ఎవరికి అత్యవసరమో, వారికే రుచించదు. * తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.