కన్న కూతుర్ని కడతేర్చిన తండ్రి

Published: Tuesday February 05, 2019
దళితుడిని ప్రేమించిందన్న కోపంతో కన్నకూతుర్నే గొంతు పిసికి చంపేశాడో కసాయి తండ్రి. ఆపై అనారోగ్యంతో మృతిచెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో తానే హత్య చేశానని అంగీకరించాడు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ కులోన్మాద హత్య వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కోట వెంకటరెడ్డికి ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె వైష్ణవి (20) ఒంగోలులోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.
 
లింగసముద్రంకు చెందిన సహ విద్యార్థి, ఎస్సీ కులస్థుడైన సునీల్‌తో ఆమె పరిచయం ప్రేమగా మారింది. విషయం వైష్ణవి తండ్రికి తెలియడంతో కుమార్తెను మందలించాడు. దీంతో ఆమె గతనెల 31à°¨ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తల్లిడండ్రులు కళాశాల యాజమాన్యం సాయంతో సునీల్‌ను గుర్తించి.. అతని ద్వారా ఆమె తిరుపతిలో ఉందని తెలుసుకున్నారు. సునీల్‌తో ఆమెకు ఫోన్‌ చేయించి ఇంటికి తీసుకొచ్చారు. ఆమె ఈనెల 2à°¨ మరోసారి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అర్ధరాత్రి à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ సమయంలో వైష్ణవి మార్కాపురంలో ఉందని పోలీసుల ద్వారా సమాచారం అందుకొన్న తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.
 
ఆదివారం అర్ధరాత్రి కూడా ఆమె ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా తండ్రి అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. దీంతో ఆగ్రహానికి గురైన వెంకటరెడ్డి కుమార్తె గొంతు నులిమి చంపేశాడు. గ్రామస్థులకు తన కుమార్తె నాలుగు రోజులుగా అన్నం తినడం లేదని దీంతో నీరసించి చనిపోయిందని నమ్మబలికాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని వెంకటరెడ్డిని విచారించగా తానే చంపినట్లు అంగీకరించాడు.