ఆరేళ్ల బాలికకు నరకం చూపి చంపాడు.

Published: Saturday March 23, 2019
ఆరేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన దుర్మార్గుడు పోలీసులకు చిక్కాడు. తాను బాలికను నమ్మించి తీసుకెళ్లింది మొదలు.. ఆమె పట్ల వ్యవహరించిన తీరును విచారణలో అతడు వెల్లడించాడు! వింటున్న పోలీసులకే ఒళ్లు గగుర్పొ డించింది. à°† చిన్నారికి అంతలా నరకం చూపెట్టి చంపాడా దుర్మార్గుడు. హోలీ రోజు ఇంటికి దగ్గర్లోనే అన్నయ్య, స్నేహితులతో కలసి ఆడుకుంటున్న బాలికను రంగులిప్పిస్తానంటూ వెంట తీసుకెళ్లాడు. à°“ నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై రెండుసార్లు అత్యాచారం చేసి.. ఇనుప చువ్వను గొంతులో గుచ్చి హత్య చేశాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ ఆల్వాల్‌లో తీవ్ర కలకలం సృష్టించిన బాలిక అత్యాచారం, హత్య కేసును పోలీసులు ఛేదించారు.
à°ˆ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు, బిహార్‌కు చెందిన రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం జీడిమెట్లలోని డీసీపీ కార్యాలయంలో బాలానగర్‌ డీసీపీ పద్మజ వివరాలు వెల్లడించారు.
మెదక్‌ జిల్లాకు చెందిన దంపతులు బతుకుదెరువుకోసం నగరానికొచ్చి అల్వాల్‌లో ఉంటున్నారు. భర్త స్థానికంగా ఉన్న డెయిరీలో పనిచేస్తుండగా.. భార్య చుట్టుపక్కల ఇళ్లలో పనిచేస్తోంది. వీరికి కొడుకు (7), కూతురు (6) ఉన్నారు. గురువారం ఉదయమే భార్యాభర్తలు పనికివెళ్లారు. హోలీ పండుగ కావడంతో à°† చిన్నారులిద్దరూ చుట్టుపక్కల ఉండే తోటి పిల్లలతో కలిసి రంగులు కొనుక్కొని పండుగను ఆనందంగా జరుపుకొంటున్నారు. అక్కడే బిహార్‌కు చెందిన ధర్మేంద్ర అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. అతడు.. తన బావమరిది రోషన్‌, మిత్రులు రాజేశ్‌, సురేంద్ర, సుబ్రహ్మణ్యంలను తన గదికి పిలిపించుకున్నాడు. అక్కడే అందరూ మద్యం తాగారు. à°ˆ క్రమంలో రాజేశ్‌ బయటికొచ్చాడు. హోలీ సంబరాల్లో మునిగిపోయిన పిల్లల్లో ఆరేళ్ల చిన్నారిపై à°† దుర్మార్గుడి కన్నుపడింది. అంతే.. అతడు చేయరాని పనే చేశాడు.
 
మధ్యాహ్నం 3 గంటలకు ఆడుకుంటున్న పిల్లల వద్దకు రాజేశ్‌ వెళ్లాడు. బాలికను, ఆమె అన్నయ్యను దగ్గరకు పిలిచాడు. హోలీ ఆడుకోవడానికి రంగులు కొనిస్తానని చెప్పి, దుకాణానికి తీసుకెళ్లాడు. అక్కడ à°† బాలుడికి రంగులు, స్నాక్స్‌ కొనిచ్చాడు. à°† తర్వాత à°† బాలుడు ఆడుకోవడానికి వెళ్లగానే.. చిన్నారి వద్దకు వెళ్లి తనకు కూడా రంగులు కొనిస్తానని వెంటతీసుకెళ్లాడు. ఆమెను పక్కనే ఉన్న రైల్వేట్రాక్‌ ఆవల 20 మీటర్ల దూరంలోని ముళ్లపొదల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ à°† చిన్నారిపై అత్యాచారం చేశాడు.
 
భయంతో ఆమె ఏడుస్తుండడంతో రాజేశ్‌.. కోపంతో తన వద్ద ఉన్న ఇనుప చువ్వతో చిన్నారి మెడపై గాయం చేశాడు. à°† తర్వాత మరోసారి అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పటికే à°† చిన్నారి మృతి చెందడంతో అక్కడే ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయాడు. ఇంటికొచ్చిన తల్లిదండ్రులకు పాప కనిపించలేదు. చుట్టుపక్కల వారి సాయంతో వెతికినా కనిపించకపోవడంతో రాత్రి 8:00 గంటలకు అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు.. 3 బృందాలుగా రంగంలోకి దిగి.. రాత్రి 9:30 గంటలకు పొదల్లో పాప మృతదేహాన్ని గుర్తించారు. పాప అన్నయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్‌ 2నెలల క్రితమే నగరానికి వచ్చాడు. à°“ టెంట్‌ హౌజ్‌లో అతడిని ధర్మేంద్రే పనికి కుదిర్చాడు. రాజేశ్‌ నమ్మకంగా, బుద్ధిగా ఉండేవాడని చెబుతూ అతడు పాపను చంపాడని తెలిసి యజమాని షాక్‌ అయ్యాడు.