15 ఏళ్ల వయసులోనే ప్రతీకారేచ్చతో విషం
Published: Thursday August 08, 2019

డుతూ పాడుతూ పాఠశాల జీవితాన్ని ఆస్వాదించాల్సిన వయసులో ఆ పసి హృదయం పగతో రగిలిపోయింది. 15 ఏళ్ల వయసులోనే ప్రతీకారేచ్చతో విషం చిమ్మింది. తన తల్లిని దూషించాడన్న కారణంతో హాస్టల్లో తోటి విద్యార్థిపై కక్ష పెంచుకున్న పదో తరగతి విద్యార్థి అదును చూసి మరీ మట్టుబెట్టాడు. చిన్న వివాదాన్ని మనసులో పెట్టుకొని కత్తితో గొంతు కోసి కడతేర్చాడు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చల్లపల్లి బీసీ సంక్షేమ హాస్టల్లో బాలుడు హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. అదే హాస్టల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థే ఈ హత్య చేశాడని నిర్ధారించి అతడిని అరెస్టు చేశారు. ఆ వివరాలను జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు బుధవారం వెల్లడించారు.
చల్లపల్లి బీసీ హాస్టల్లో నాలుగు రోజుల క్రితం బట్టలు ఉతికే సమయంలో మూడో తరగతి విద్యార్థి ఆదిత్య (8)కు, పదో తరగతి విద్యార్థికి మధ్య చిన్న వివాదం జరిగింది. ఆ సమయంలో ఆదిత్య.. 10వ తరగతి విద్యార్థి తల్లిని దూషించాడు. దీన్ని మనసులో పెట్టుకున్న ఆ విద్యార్థి.. ఆదిత్యపై కక్ష పెంచుకున్నాడు. హాస్టల్లో వార్డెన్, వాచ్మెన్ లేని సమయం చూసి గదిలో ఆదిత్య పక్కనే పడుకున్నాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రలేపి తన బక్కెట్ పోయింది వెదుకుదాం రమ్మని డాబాపైకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆదిత్యను బాత్రూమ్ వద్దకు తీసుకువెళ్లి జేబులో వెంట తెచ్చుకున్న పెన్సిల్ చెక్కే చాకుతో మెడపై విచక్షణా రహితంగా కోసి చంపాడు. అనంతరం చాకుని కడిగి, రక్తపు మరకలైన దుస్తులు మార్చుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా గోడదూకి బయటకు వెళ్లిపోయాడు. మర్నాడు ఉద యం హాస్టల్లోకి వస్తూ వాచ్మన్ను కలిసి తాను రాత్రి సినిమాకు వెళ్లి వస్తున్నానని చెప్పాడు. అయితే తమ విచారణలో పదో తరగతి విద్యార్థి ఈ నేరం చేసినట్టు తేలిందని ఎస్పీ చెప్పారు. ఆ విద్యార్థి బ్యాగ్లో చాకు, రక్తపు మరకలున్న చొక్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్నారు.

Share this on your social network: