దాచేపల్లి ఘటనపై డిప్యూటీ సీఎం ఆరా

దాచేపల్లి: గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటనపై డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప
ఆరా తీశారు. జిల్లా గుంటూరు రూరల్ ఎస్పీతో ఫోనులో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. అత్యాచారానికి నిరసనగా దాచేపల్లిలో జరుగుతున్న బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని డిప్యూటీ సీఎం చినరాజప్ప పోలీసులను ఆదేశించారు.
మైనర్ బాలికపై 50ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికి గత అర్ధరాత్రి రాస్తారోకో చేశారు. దీంతో అద్దంకి, నార్కెట్పల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అత్యాచారం చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ బాలిక బంధువులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికను గురజాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Share this on your social network: