మూడేళ్ళ కూతురును గొంతుకోసి...
Published: Saturday August 25, 2018

విజయనగరం: భార్యపై కోపంతో తన మూడేళ్ళ కూతురును దారుణంగా హత్య చేశాడో కసాయి తండ్రి. ఈ సంఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. గుర్ల మండలం గారికివలస గ్రామంలో శ్రీను అనే వ్యక్తి తన కూతురు సుమలత(3)ను శనివారం తెల్లవారుజామున కత్తిపీటతో గొంతుకోసి హత్యకు పాల్పడ్డాడు. కొద్దిరోజులుగా శ్రీను భార్య కాపురానికి రావడం లేదు. దీంతో భార్యపై కోపం పెంచుకున్న అతను కన్నకూతురుని దారుణంగా హత్యచేయడం పట్ల పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Share this on your social network: