ఆ తండ్రి కొడుకును ఎందుకు చంపాడంటే...
Published: Sunday September 16, 2018

తూ.గో. జిల్లా: కాకినాడ రూరల్ మండలం బుల్లబ్బాయిరెడ్డినగర్లో కన్న కొడుకు గోవింద్ని తండ్రి హత్య చేశాడు. గోవింద్ పెళ్లి చేసుకుని ఏ పనీ చేయకుండా తండ్రి మీద ఆధారపడటంతో గత కొంతకాలంగా తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తండ్రి కొడుకును హత్య చేశాడు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందవలసి ఉంది.

Share this on your social network: