రైల్వే శాఖ తీపి కబురు
Published: Friday February 22, 2019

నిరుద్యోగులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. మరో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆ శాఖ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదలకానుంది. ట్రాక్మెన్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గార్డ్, పారామెడికల్ సిబ్బంది, నర్సులు తదితర పోస్టులు ఈ దఫా భర్తీ కానున్న కేటగిరీల్లో ఉన్నాయి. ఈ నెల 28 నుంచి మార్చి 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల్లో... ఈడబ్ల్యూఎ్సకు 10ు కోటా కేటాయించారు. కాగా.. రానున్న రెండేళ్ళలో రైల్వేల్లో లక్ష మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు పదవీ విరమణ చేయనున్నారు. ఈ ఖాళీలను కూడా తాజా నోటిఫికేషన్లో పొందుపరచనున్నారు.

Share this on your social network: