నేటి నుంచి ఏపీ టెట్
Published: Sunday June 10, 2018

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆదివారం నుంచి ఈ నెల 19 వరకూ ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాల అభ్యర్థుల కూడా పోటీ పడుతున్నారని తెలిపారు. మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకొన్నారని, వారి కోసం 113 పరీక్షా కేంద్రాలు కేటాయించామన్నారు. రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తొలి సెషన్, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5గంటల వరకూ రెండో సెషన్ పరీక్ష ఉంటుంది.
పరీక్ష ముగిసిన వెంటనే కంప్యూటర్ స్ర్కీన్పై సుమారుగా మార్కులు తెలిసిపోయేలా ఏర్పాట్లు చేశామని గంట్రా చెప్పారు. సందేహాలు 9505619127, 9505780616, 9505853627 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.

Share this on your social network: