పవన్‌ కరపత్రంలో హామీలు

Published: Thursday December 06, 2018
 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. ప్రభుత్వాలు ఇచ్చే రేషన్‌ బియ్యం బాగుండడం లేదని.. అందువల్ల రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛను ఇస్తామని తెలిపారు. వయసు మళ్లిన వారికి వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం జిల్లాలో నాలుగో రోజు పర్యటనలో భాగంగా ఆయన బుధవారం గార్లదిన్నె మండలం మర్తాడులో పార్టీ ఫేస్‌బుక్‌ ప్రత్యక్ష కార్యక్రమం జనతరంగాన్ని ప్రారంభించారు. గ్రామంలో ముత్యాలప్ప, కృష్ణమూర్తి సోమశేఖర్‌, చిన్నకాసిం తదితరుల ఇళ్లకు వెళ్లి సమస్యలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. అనంతరం వారికి జనసేన మేనిఫెస్టో ఉన్న కరపత్రాన్ని అందజేసి.. అందులోని అంశాలను వివరించారు. జనతరంగం ఐదు రోజుల పాటు కొనసాగుతుందని, దీనిని ప్రపంచమంతా వీక్షించవచ్చన్నారు. ‘మేం ఎన్నికల కోసం, ఓట్ల కోసం రాలేదు. మీ బిడ్డల భవిష్యత్‌ కోసం వచ్చాం. అందుకోసమే జనసేన పనిచేస్తోంది.
 
అంతా కులాలను వాడుకుంటారు. మేం అన్ని కులాలను à°’à°• చోట చేర్చేందుకు వచ్చాం’ అని చెప్పారు. ఆయన తొలుత గ్రామంలోని 63 ఏళ్ల వ్యవసాయ కూలీ జీలకర్ర ముత్యాలప్ప ఇంటి తలుపు తట్టారు. à°† కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు. తన కుమారుడు జర్నలిజం చేసి నిరుద్యోగిగా ఉన్నాడని, తాను అర్థరూపాయి కూలీ నుంచి పనిచేస్తున్నానని.. వృద్ధాప్య పింఛను రావడం లేదని ముత్యాలప్ప చెప్పారు. ఇంతటి కష్టాల్లో ఉన్న వారిని ప్రభుత్వాలు బాగా చూసుకోవాలని పవన్‌ పేర్కొన్నారు. 62 ఏళ్ల వయసులోనూ కష్టపడాల్సి రావడం మారాలన్నారు. à°’à°• వైపు కులాలు ఉండకూడదంటూనే మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్‌ అంటూ విడగొడతారని.. కులాలు లేనప్పుడు అన్నీ కలిసే ఉండాలని అన్నారు. అనంతరం కృష్ణమూర్తి ఇంటికి వెళ్లారు. నాలుగేళ్ల à°•à°¿à°‚à°¦ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు చేయలేదని కృష్ణమూర్తి చెప్పారు. జనసేన జెండా పట్టానని తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇలా ఎంతకాలం బెదిరిస్తారని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు అభివృద్ధి చేయకపోగా.. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తప్పుబట్టారు. తాను ఓట్లు వేయించుకోవడానికి రాలేదని.. మార్పుకోసం వచ్చానని.. పాతికేళ్లు ప్రజల కోసం పని చేయడానికి వచ్చానని చెప్పారు. రైతు రుణమాఫీపై చంద్రబాబు నోరు తప్ప చేయి మాట్లాడడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలను కొనడంలో ఉన్న శ్రద్ధ రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంపై పెట్టడం లేదని ఆరోపించారు.
 
ప్రజాప్రతినిధులు రాజ్యాంగాన్ని హైజాక్‌ చేస్తున్నారని పవన్‌ అన్నారు. రాష్ట్రంలో వారు పేదల పక్షాన నిలవకుండా సొంత లబ్ధి కోసం పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. స్వచ్ఛమైన రాజకీయాలను తెచ్చేందుకు యువత భాగస్వామ్యం కావాలన్నారు. ‘పేదల అభివృద్ధి, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే జనసేన లక్ష్యం. ఇజ్రాయెల్‌ తరహాలో అగ్రికల్చర్‌ జోన్లు ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తాం. రైతులకు క్యాలెండర్‌ ప్రాతిపదికన సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలి. సమాజంలో అవినీతిపై రాజీలేని పోరాటం చేయడంలో జనసేన ముందుంటుంది’ అని తెలిపారు. కరపత్రాల్లోని అంశాలను జన సైనికులు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు రావాలన్నారు. జన సైనికులు, యువత ప్రతి ఇంటి తలుపూ తట్టి మేనిఫెస్టో, సిద్ధాంతాలను వివరించాలని సూచించారు. అనంతరం మర్తాడు గ్రామ సమీపం శివారులోని పొలాలను పరిశీలించి రైతులు, కూలీల సమస్యలను తెలుసుకున్నారు. తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలం గుండువారిపల్లెలో సీఎం చంద్రబాబు రెయిన్‌గన్‌ ప్రారంభించిన రైతు శివన్న పొలాన్ని పవన్‌ పరిశీలించారు.