ఎలుకల కోసం పుట్టను తవ్వుతుండగా...పాముకాటు

Published: Saturday December 08, 2018

చౌడేపల్లె: à°ªà°¾à°®à±à°•à°¾à°Ÿà±à°•à± à°“ యువకుడు మృతి చెందిన సంఘటన చౌడేపల్లె మండలంలో జరిగింది. కుటుంబీకుల కథనం మేరకు... పందిళ్లపల్లె పంచాయతీ దామరకుంటకు చెందిన గొల్లపల్లె సిద్ధప్ప కుమారుడు పెద్దబ్బోడు(28) కూలి పనులతో పాటు అడవిదినుసులు సేకరించి విక్రయిస్తూ జీవించేవాడు. అతడు మండలంలోని చుక్కావారిపల్లె సమీపంలోని పొలాల్లో ఎలుకలు పట్టుకునేందుకు à°“ పుట్టను తవ్వుతుండగా పాము కాటేసింది. నాటువైద్యం చేస్తుండగా మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. పెద్దబ్బోడుకు భార్య, రెండేళ్లపాప, ఏడాది కుమారుడు ఉన్నారు.