‘క్రాస్‌ బో-18’ విజయవంతమైందని ప్రకటన

Published: Sunday December 09, 2018

రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సూర్యలంక తీరంలో వైమానిక దళ అధికారులు క్షిపణి ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. ‘క్రాస్‌బో-2018’ పేరుతో రెండు రోజులపాటు చేపట్టిన à°ˆ విన్యాసాలు సక్సెస్‌ అయినట్లు నేవీ వర్గాలు తెలిపాయి. నాలుగు రకాల క్షిపణులు ఆకాశ్‌, స్పైడర్‌, ఓఎ్‌సఏ-ఏకే-à°Žà°‚, ఐజీఎల్‌ఏలను ప్రయోగించారు. భూ ఉపరితలం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఇవి ఛేదిస్తాయి. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీరేంద్ర సింగ్‌ ధనోవా ముఖ్యఅతిథిగా హాజరయ్యరు. దక్షిణ ఎయిర్‌ కమాండ్‌ ఆఫీసర్‌, కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ కెప్టెన్‌ ఆర్‌à°Žà°‚ కుమారస్వామి వీటికి సారథ్యం వహించారు. నేవీ ఇలాంటి విన్యాసాలు చేయడం ఇదే మొదటిసారని ధనోవా పేర్కొన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సన్నద్ధంగా ఉన్నామని చెప్పడానికే à°ˆ ప్రయోగాలని ఆయన చెప్పారు.