‘పెథాయ్’ తుఫాన్‌పై ఏపీ ప్రభుత్వం అప్రమత్తం

Published: Friday December 14, 2018

అమరావతి: ‘పెథాయ్’ తుఫాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు సన్నద్ధతపై ఈరోజు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. తుఫాను ప్రభావ పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేట తుపాన్ సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్‌లో ఉండాల‌ని ఆదేశించారు. ఆయా శాఖ‌à°² అధికారులు ఆర్టీజీఎస్‌తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీంతో అన్ని జిల్లాల యంత్రాంగాన్ని ఆర్టీజీఎస్‌ అప్రమత్తం చేసింది