వైసీపీలో చేరతారని ప్రచారం

Published: Saturday December 29, 2018

 à°¸à±€à°¨à°¿à°¯à°°à±‌ నేత, ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి మీసం తిప్పి మరీ సవాల్‌ విసిరి వార్తల్లోకి వచ్చిన అనంతపురం జిల్లా కదిరి అర్బన్‌ సీఐ గోరంట్ల మాధవ్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిసింది. త్వర లో ఆయన వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం రాత్రి తన రాజీనామా లేఖను కదిరి డీఎస్పీ లక్ష్మికి అందించినట్లు సమాచారం! 22 ఏళ్లుగా పోలీసు శాఖలో ఉన్న మాధవ్‌కు దూకుడు ఎక్కువనే పేరుంది. పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా.. జేసీ దివాకర్‌ రెడ్డికి సవాలు విసిరి మరోమారు వార్తల్లోకి వచ్చారు. హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకే.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.