చంద్రబాబుపై చవాకులు పేలితే నీ అంతు చూస్తాం..

Published: Sunday December 30, 2018
విజయవాడ: à°•à±‡à°¸à±€à°†à°°à±‌.. ఖబడ్దార్‌.. మా ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవాకులూ.. చవాకులు పేలితే నీ అంతు చూస్తాం.. ఓటర్‌కు క్వార్టర్‌కు తేడా తెలియని నువ్వా.. మా నాయకుడిని విమర్శించేది? అంటూ తెలుగుదేశం నాయకులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ విమర్శించటాన్ని నిరసిస్తూ తెలుగుదేశం నాయకులు శనివారం రాత్రి గాంధీనగర్‌ ధర్నాచౌక్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
 
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ తెలుగుజాతి స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే స్థాయి నీదా అంటూ విమర్శించారు. తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కేసీఆర్‌ పోస్టర్‌లను ముక్కలు ముక్కలుగా చింపి దహనం చేశారు. à°ˆ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొట్టిముక్కల రఘురామరాజు, వై.శ్రీనివాసరావు, సుబ్బారావు, శేషురాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.