యువకుని కిడ్నాప్‌, దారుణ హింస

Published: Tuesday February 05, 2019
: à°“ యువకుడిని కిడ్నాప్‌ చేసి దారుణంగా కొట్టి బెదిరించి ఖాళీ చెక్కులు, నోట్లపై సంతకాలు పెట్టించుకోగా...అనంతరం అతను అస్వస్థతకు గురై మృతి చెందిన ఉదంతం గుంటూరులో వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.... పాతగుంటూరులోని బాలాజీనగర్‌కు చెందిన ఇక్కుర్తి శ్రీహరి (26) పెయింట్స్‌ అండ్‌ ఎలక్ర్టికల్‌ షాపు నిర్వహిస్తుంటాడు. పొత్తురువారితోటలో న్యూఎ్‌సపీ పెయింట్స్‌ షాపు యజమాని హబీబ్‌తో శ్రీహరికి పరిచయం ఏర్పడింది.
 
à°—à°¤ నెల 25à°¨ హబీబ్‌ ఇండోనేషియా వెళుతూ తన పేరున ఉన్న ఏషియన్‌ పెయింట్స్‌ డీలర్‌ షిప్‌ను వాడుకోవాలని శ్రీహరికి అప్పగించి వెళ్లాడు. à°ˆ విష యం తెలుసుకున్న హబీబ్‌ బావమరిది ఫిరోజ్‌, తమ్ముడు జాబిద్‌.. à°“ ఆర్‌ఎస్సై, పత్రికా విలేకరిని కలుపుకొని శ్రీహరిని కిడ్నాప్‌ చేసి గుం టూరువారితోటలో à°’à°• షాపులో బంధించారు. ఏషియన్‌ పెయింట్స్‌ డీలర్‌ షిప్‌ తమకు అప్పగించాలన్నారు. అంగీకరించకపోవడంతో శ్రీహరిని బెదిరించి కొట్టారు. 8 ఖాళీ చెక్కులు, 2 ప్రామిసరీ నోట్లు, 2 తెల్ల పేపర్లపై సంతకాలు పెట్టించుకొని వదిలేశారు. బాధితుడు ఆదివారం రాత్రి పాతగుంటూరు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. స్టేషన్‌ బయటకు రాగానే అస్వస్థతకు గురైన శ్రీహరిని ప్రభుత్వశాలకు తరలించగా అక్కడ మృతి చెందాడు.