బుల్లితెర ఇక భారమే!

Published: Wednesday February 06, 2019
బుల్లితెర ప్రేక్షకుడికి వినోదం మరింత భారం కానుంది. ఇప్పటివరకు రూ.250 చెల్లించి (గ్రామాల్లో రూ.100 నుంచి రూ.150) 300 నుంచి 500 వరకు చానెల్స్‌ను చూస్తున్న ప్రేక్షకుడు ఇకపై అదే స్థాయిలో చానెల్స్‌ను చూడాలంటే రూ.500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ట్రాయ్‌ రూపొందించిన టారిఫ్‌ ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. అంటే ప్రస్తుతం ప్రసారమవుతున్న ఫ్రీ చానెల్స్‌ బుధవారం అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి. ఇకపై వినియోగదారుడు నచ్చిన చానెల్స్‌ను కొంత మొత్తం చెల్లించి చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వందల సంఖ్యలో వస్తున్న ఫ్రీ ఎయిర్‌ చానెల్స్‌కు కూడా నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
 
ఫ్రీ టూ ఎయిర్‌ చానెల్స్‌ ప్రసారాలన్నీ బుధవారం అర్ధరాత్రి నుంచి బంద్‌ కానున్నాయి. ఇకపై వీటికి నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు (ఎన్‌సీఎఫ్‌) à°•à°¿à°‚à°¦ నెలకు రూ.130, ట్యాక్స్‌ రూ.24 కలిపి మొత్తం రూ.154 చెల్లించాల్సి ఉంటుంది. à°ˆ మొత్తాన్ని చెల్లించిన వినియోగదారుడు ఫ్రీ టూ ఎయిర్‌లో వుండే 300 చానెల్స్‌లో నచ్చిన వంద చానెల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫ్రీ ఎయిర్‌లో వుండే ఇతర ఏ ఒక్క చానెల్‌ను చూడాలన్నా వినియోగదారుడు రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే తనకు నచ్చిన à°’à°• చానెల్‌తోపాటు మరో 24 చానెల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఇదే మొత్తంతో కొన్ని వందల చానెల్స్‌ను చూస్తున్న వినియోగదారుడు ఇకపై వంద చానెల్స్‌ను మాత్రమే చూడాల్సి ఉంటుంది.
 
ప్రస్తుతం సగటు తెలుగు టీవీ ప్రేక్షకుడు చూసే ప్రధాన చానెల్స్‌లో ఒక్కటి కూడా ఫ్రీ టూ ఎయిర్‌లో లేవని తెలుస్తోంది. 300 చానెల్స్‌లో 26 డీడీ చానెల్స్‌, ఇతర చానెల్స్‌ వున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రధాన చానెల్స్‌ అన్నీ పే చానెల్స్‌లో పెట్టడం వల్ల వినియోగదారుడిపై మరింత భారం పడనున్నది.
 
పే చానెల్స్‌ను అర్ధరూపాయి నుంచి రూ.19à°•à°¿ మించకుండా వినియోగదారుడికి అందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఆయా కంపెనీలన్నీ రూ.19కే ఇస్తున్నాయి తప్ప కనిష్ఠంగా పేర్కొన్న అర్ధరూపాయిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. పైగా కొన్ని చానెల్స్‌ సిండికేట్‌à°—à°¾ ఏర్పడి ప్యాకేజీల రూపంలో అందించే ప్రయత్నాన్ని చేస్తున్నాయి. దీనివల్ల ప్రస్తుతం సగటు టీవీ ప్రేక్షకుడు రూ.150 నుంచి రూ.250 చెల్లించి వందల చానెల్స్‌ను చూస్తుంటే, ఇకపై రెట్టింపు చెల్లిస్తేగానీ ప్రస్తుతం చూస్తున్న చానెల్స్‌ చూడలేని పరిస్థితి.
 
ప్రస్తుతం ట్రాయ్‌ తీసుకువచ్చిన కొత్త నిబంధనలతో వినియోగదారుడు చెల్లించే మొత్తంలో 80 శాతం బ్రాడ్‌కాస్టర్‌కు, 20 శాతం ఎంఎస్‌వో, లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్‌ తీసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆయా చానెల్స్‌లో వచ్చే ప్రకటనల ఆదాయంలోను బ్రాడ్‌ కాస్టర్స్‌కు కొంత వాటా వస్తుంది. అంతిమంగా ట్రాయ్‌ తీసుకువచ్చిన కొత్త నిబంధనల వల్ల వినియోగదారుడిపై భారం పడనుండగా, బ్రాడ్‌కాస్టర్స్‌కు ప్రయోజనం చేకూర్చ నున్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. పే చానెల్స్‌లో ప్రకటనలు వున్న వాటిని వినియోగదారుడికి రూ.19à°•à°¿ ఇవ్వాలని, ప్రకటనలు లేని చానెల్స్‌ను అర్ధ రూపాయికి ఇవ్వాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు.
 
ట్రాయ్‌ కొత్త నిబంధనలతో వినియోగదారుడిపై భారం పడుతుంది. అదే సమయంలో వినియోగదారుడు చెల్లించే మొత్తంలో 80 శాతం బ్రాడ్‌కాస్టర్‌కే దక్కుతుంది. దీనివల్ల ఎంఎస్‌వోలు, లోకల్‌ కేబుల్‌ ఆపరేటర్స్‌కు ఆదాయం తగ్గిపోనుంది. బుల్లితెర ప్రేక్షకుడికి మేలు పేరుతో ట్రాయ్‌ భారీగా బాదుడుకు శ్రీకారం చుట్టింది. à°ˆ విధానం వల్ల కార్పొరేట్లకే లాభం చేకూరుతుంది. వినియోగదారుడిపై భారం పడకుండా ట్రాయ్‌ చర్యలు తీసుకుంటే బాగుంటుంది. తాజా నిబంధనలు ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.