చంద్రబాబు బీజేపీని వీడటానికి కారణం ఆయనే

Published: Thursday February 07, 2019
మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ మహిళా నేత విజయశాంతి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాపై చేసిన ట్వీట్స్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఆమె ప్రధానంగా అమిత్ à°·à°¾ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు. అమిత్ à°·à°¾ మాట్లాడుతూ.. వచ్చే లోక్‌సభ ఎన్నికలు మోడీకి, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతాయని ప్రకటించారని, మిత్రపక్షాలైన ఎన్‌డీఏ కూటమి పార్టీల అవసరం లేకుండానే మోడీ నేతృత్వంలోని బీజేపీ మెజారిటీ సీట్లను గెలుస్తుందనే ధీమా అమిత్‌à°·à°¾ మాటల్లో ధ్వనిస్తోందని విజయశాంతి ట్వీట్ చేశారు.
 
ఇలా à°’à°• వ్యక్తి చుట్టూ బీజేపీ పార్టీని తిప్పడం వల్లే à°† పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా దూరమైపోయారని, మోదీ ఆధిపత్య ధోరణిని తట్టుకోలేక ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ వైదొలిగిందని విజయశాంతి ట్వీట్ చేశారు. ఇంత జరిగినా.. à°·à°¾ మిత్రపక్షాలను లెక్కచేయని విధంగా మోదీ స్థుతి పాడటం వారి నిరంకుశత్వానికి అద్దం పడుతుందని ఆమె ట్వీట్ చేశారు. అమిత్‌ à°·à°¾ ప్రకటనపై శివసేన ఎలా స్పందిస్తుందో చూడాలని విజయశాంతి చేసిన ట్వీట్ ఎన్‌డీఏ మిత్రపక్షాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది.