బాబును అన్న కాదు.. దున్న అనాలి

Published: Monday February 11, 2019
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్ల ను కొనేందుకు చంద్రబాబు కొత్త అవతారమెత్తాడనే విషయం పసుపు-కుంకుమ ద్వారా తెలుస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పసుపు-కుంకుమకు ఉన్న పవిత్రతను చంద్రబాబు తుడిచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును ‘అన్న’ అని కాకుండా ‘దున్న’ అని పిలవాలన్నారు. ఆదివా à°°à°‚ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె.. మీడియాతో మాట్లాడారు. రూ.వెయ్యి పింఛను ఇవ్వడానికి ముక్కీమూల్గిన చంద్రబాబు.. ప్రస్తుతం రూ.2 వేలకు పెంచటడమేంటన్నారు.
 
ఇలా పింఛను పెంచి తనకు ఓట్లు వేయాలని అడుగుతూ à°Žà°‚à°¤ దిగజారిపోతున్నారో అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో మహిళల పసుపు-కుంకుమను తుడిచేలా బెల్డ్‌షాపులు రావటానికి చంద్రబాబే కారణమని రోజా ఆరోపించారు. ‘టీడీపీ నాయకులకు నేను à°“ సవాలు విసురుతున్నా. మీ ఇంట్లో ఆడవాళ్ల తాళిబొట్టుపై ప్రమాణం చేసి à°ˆ పసుపు-కుంకుమ డ్రామా కాదని చెప్పగలరా?’ అని ప్రశ్నించారు.