జగన్‌ను పోటీకి అనర్హుడిగా ప్రకటించండి

Published: Wednesday February 13, 2019

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. విజయవాడలో ఉన్న సీఈసీ సునీల్‌ అరోరాను మంగళవారం టీడీపీ నాయకులు చుక్కపల్లి రమేష్‌, కృష్ణయ్య, పట్టాభిరామ్‌ తదితరులు కలిశారు. ‘ఓటుకు రూ.5 వేలు డిమాండ్‌ చేసి తీసుకుని, ఓటు మాత్రం వైసీపీకి వేయాలని జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచేలా ఉన్నా యి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్లు 8, 9, 123లకు జగన్‌ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయి. ఇలా ప్రజల్ని రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకుని, వచ్చే ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించాలి’ అని టీడీపీ నేతలు సీఈసీకి విజ్ఞప్తి చేశారు.