జగన్‌ వస్తే శ్మశానం....బాబుతో సంక్షేమం..

Published: Tuesday February 19, 2019

 à°šà°‚ద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతాయనే ధృడ విశ్వాసం రాష్ట్ర ప్రజల్లో ఉందని, జగన్‌ వస్తే రాష్ట్రం శ్మశానం అవుతుందన్న భయం వారిని వెంటాడుతోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రభుత్వవిప్‌ బుద్దావెంకన్న అన్నారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. బీసీల విషయంలో జగన్‌ వైఖరి ‘ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్నట్లుగా ఉందని వెంకన్న మండిపడ్డారు. అన్ని విషయాల్లో పక్క రాష్ట్రాన్ని మెచ్చుకునే జగన్‌కు, à°† రాష్ట్రంలో 26 కులాలను బీసీ జాబితాలో నుంచి తొలగించిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు.