‘కువైత్‌ శంఖారావం’

Published: Saturday February 23, 2019

‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధికి అడుగడుగున కేంద్రం, వైసీపీ అడ్డంకులు, అవరోధాల సృష్టిస్తున్నాయి. నూతన రాష్ట్రం సవాలక్ష సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ సీఎం చంద్రబాబు ఆత్మస్థైర్యంతో, చిత్త శుద్ధితో రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నారు’’ అని ఆంధ్ర నాయకులు గల్ఫ్‌లో కొనియాడారు. కువైత్‌లోని టీడీపీ అభిమానులు నిర్వహించిన ‘కువైత్‌ శంఖారావం’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. స్వదేశంలో ఎన్నికల ప్రచారానికి ధీటుగా జరిగిన à°ˆ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, ఎన్‌à°Žà°‚à°¡à±€ ఫారూఖ్‌, సీ ఆదినారాయణ రెడ్డి, నాయకులు గొల్లపల్లి సూర్యారావు, జూపుడి ప్రభాకర్‌ రావు, ఏపీ ఎన్నార్టీ చైర్మన్‌ వేమూరి రవి తదితరులు మాట్లాడారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ అన్ని వర్గాల వారితో పాటుగా ప్రవాసీయుల సంక్షేమానికీ తెలుగుదేశం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వారు వివరించారు.