హైకోర్ట్ సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడింది

Published: Monday March 04, 2019
తెలంగాణ ప్రభుత్వంపై మంత్రి లోకేష్ మండిపడ్డారు. తమ డాటాను దొంగిలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ పరువు తీశారని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన వైసీపీ అధినేత జగన్‌ను దొంగబ్బాయితో పోల్చారు. కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌ను ఉద్దేశిస్తూ.. తమకు రిటర్న్ గిఫ్ట్‌à°—à°¾ ఏపీలో ప్రచారం చేస్తారనుకుంటే హైదరాబాద్‌లో డాటా దొంగిలిస్తారా అంటూ ఎద్దేవా చేశారు.
‘‘హైకోర్ట్ సాక్షిగా దొరగారి దొంగతనం బయటపడింది. తెల్లకాగితాలపై వీఆర్ఓ సంతకాలతో అడ్డంగా దొరికిపోయారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీలపై దాడి చేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేశారని తేలిపోయింది’’ అని లోకేష్ ట్వీట్ చేశారు.
దానితో పాటు ‘‘రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్‌ని దెబ్బతీశారు’’ అని లోకేష్ ట్వీటారు. à°ˆ రెండు ట్వీట్లకు ‘డాటా దొంగిలించిన తెలంగాణ ప్రభుత్వం’ అని అర్థం వచ్చే విధంగా హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.