నా నియోజకవర్గంలో ఓట్ల తొలగింపునకు కుట్ర

Published: Thursday March 07, 2019

అమరావతి: à°°à°¾à°ªà±à°¤à°¾à°¡à± నియోజకవర్గంలో పెద్దఎత్తున ఓట్ల తొలగింపునకు కుట్ర జరిగిందని రాష్ట్ర మంత్రి పరిటాల సునీత అన్నారు. గురువారం సీఈవో ద్వివేదిని కలిసి ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... నా నియోజకవర్గమైన రాప్తాడులోని ఆయా మండలాల్లో మొత్తం 18, 159 ఓట్లను తొలగించేందుకు దరఖాస్తులు చేసి ఉన్నాయన్నారు. వైసీపీ నేతలు ప్రజాక్షేత్రంలో గెలవలేక అక్రమ మార్గాలను ఎంచుకున్నారని, ప్రజలు à°ˆ విషయాలను గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు.