చంద్రబాబు ఈనెల 22న కుప్పంలో నామినేషన్‌ దాఖలు

Published: Tuesday March 19, 2019
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 22à°¨ కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. విదియ తిథితో కూడిన శుక్రవారం నామినేషన్‌ వేయడానికి మంచి ముహూర్తమని à°† తేదీని నిర్ణయించారు. అయితే చంద్రబాబు à°—à°¤ మూడు దఫాలుగా ఎన్నడూ స్వయంగా వచ్చి నామినేషన్‌ వేయలేదు. ఆయన తరఫున పార్టీలోని స్థానిక ముఖ్యులే à°† ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ కుప్పం వచ్చి తండ్రి తరఫున నామినేషన్‌ దాఖలు చేశారు.
 
ఈసారి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేస్తుండడంతో అక్కడ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరిని చంద్రబాబు తరఫున నామినేషన్‌ దాఖలు చేయడానికి ఆహ్వానిస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె రాలేకపోయిన పక్షంలో గతంలో మాదిరే టీడీపీకి చెందిన స్థానిక ముఖ్యులు టీడీపీ అధినేత తరఫున నామినేషన్‌ పత్రాలు ఎన్నికల అధికారులకు అందజేస్తారని సమాచారం.