పవన్‌, నాగబాబులకు కేఏ పాల్‌ సవాల్‌

Published: Thursday March 21, 2019
 à°¨à°°à°¸à°¾à°ªà±à°°à°‚ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నానని, దమ్ముంటే పవన్‌ కల్యాణ్‌, నాగబాబు కాసుకోవాల ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ సవాల్‌ విసిరారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో పాస్టర్ల అసొసియేషన్‌ బుధవారం నిర్వహించి à°¨ కార్యక్రమంలో పాల్‌ మాట్లాడుతూ.. ప్రజాశాంతి పార్టీ తరఫున 152 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నామన్నారు. నరసాపురం నియోజకవర్గంలో పోటీలో ఉన్న à°…à°­ ్యర్థులంతా గతంలో తన ఆశీస్సు à°² కోసం వచ్చిన వారేనన్నారు.
 
చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, జగన్‌లకు ఓట్లు వేయవద్దని, వారంతా à°Ÿà°¿ కెట్లు అమ్ముకుని రాష్ర్టాన్ని దోచుకునే వారని ఆరోపించారు. హెలికాప్టర్‌ గుర్తుకు జగన్‌ అభ్యంతరం పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు మాటలు రాని తన కుమారునికి మంత్రి పదవి ఇచ్చారని హేళన చేశారు. చిరంజీవితో పోల్చుకుంటే పవన్‌à°•à°¿ సరిగా డ్యాన్సులు చేయడం రాదంటూ.. పాల్‌ నటించి చూపించారు. నియోజకవర్గానికి à°’à°• ఆసుపత్రిని కట్టిస్తానని హామీ ఇచ్చారు. తనకు మద్దతు తెలపని పాస్టర్ల సంగతి చూస్తానని సభాముఖంగా పాల్‌ హెచ్చరించారు.