జగన్‌ కేసులపై మాట్లాడటం చట్టాన్ని అతిక్రమించడమే

Published: Sunday March 24, 2019

 à°œà°—న్‌పై సీబీఐ కేసులన్నీ కోర్టుల్లో ఉన్నాయని, వాటి గురించి ఇప్పుడు మాట్లాడకూడదని సీబీఐ మాజీ జేడీ, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కోర్టులో అంశాలపై మాట్లాడితే చట్టాన్ని అతిక్రమించినట్టు అవుతుందన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘జగన్‌ చిన్నాన్న వివేకానంద హత్య కేసును దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా శాఖ ఉంది. వారి పని వారు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. రాజకీయ పార్టీల నాయకులు వారి అభిప్రాయాలు బయటకు చెబితే కేసును ప్రభావితం చేసే వీలుంది. దర్యాప్తు అధికారులు కోర్టుకే బాధ్యులు గానీ ప్రభుత్వానికి కాదు. పార్టీలు వారి అభ్యర్థులు గెలవాలని కోరుకుంటుంటే, జనసేన మాత్రం ప్రజలు గెలవాలని కోరుకుంటోంది’ అని పేర్కొన్నారు.