ఈవీఎంల తరలింపు కలకలం..

Published: Tuesday April 16, 2019

జిగిత్యాలలో ఈవీఎంల తరలింపు కలకలం రేపుతోంది. ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఈవీఎంలను సిబ్బంది ఆటోలో తరలించారు. అయితే ఇవి గ్రామాల్లో అవగాహన కోసం చూపిన పాత ఈవీఎంలంటూ జగిత్యాల ఆర్డీవో తెలిపారు. పాత స్ట్రాంగ్ రూమ్‌కు తీసుకువెళుతున్నామని వివరణ ఇచ్చారు. ఈవీఎంల తరలింపు కలకలం రేపడంతో పోటీ చేసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా, కోరుట్ల à°ˆ రెండు నియోజకవర్గాలు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. à°ˆ నేపథ్యంలో జగిత్యాలలో అర్ధరాత్రి ఈవీఎంల తరలింపు కలకలం రేగింది. పాత ఈవీఎంలని చెబుతున్న సిబ్బంది.. అర్ధరాత్రి ఎందుకు తరలించడం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పగలు తరలించవచ్చు కదా.. రాత్రి సమయంలో ఎందుకు తరలిస్తున్నారన్నా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.