సింహాచలేశుని నిజరూప దర్శనంతో పులకించిన భక్తకోటి

Published: Wednesday May 08, 2019

 à°¸à°¿à°‚హాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి నిజరూపాన్ని మంగళవారం కనులారా వీక్షించిన భక్తులు పులకించిపోయారు. ఉత్సవంలో భాగంగా సోమవారం రాత్రి స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయ వైదిక వర్గాలు శాస్త్రోక్తంగా చందన ఒలుపు కార్యక్రమాన్ని పూర్తిచేశాయి. తొలి దర్శనాన్ని తెల్లవారుజామున 2.30 గంటలకు ఆలయ అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి ఆనందగజపతిరాజు కుటుంబీకులకు కల్పించారు. కాగా, టీటీడీ తరఫున తిరుమల జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ ఓఎస్డీ శేషాద్రి అప్పన్నకు పట్టువస్ర్తాలను సమర్పించారు.