ప్రజా సమస్యలపై పోరాడతా... పవన్‌ కల్యాణ్‌

Published: Friday May 24, 2019

రెండు స్ధానాల్లోనూ తాను ఓడిపోయినా, తన పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయినా ఆఖరిశ్వాస వరకూ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. గురువారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనసేన పార్టీ సుదీర్ఘ రాజకీయ ప్రణాళికతో ముందుకు వచ్చిందని, à°ˆ ఎన్నికల్లో ఓటమి బాధించలేదన్నారు. విజయం సాధించిన మోదీ, జగన్‌లకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హోదా కోసం వై.ఎస్.జగన్‌ కృషి చేయాలని కోరారు. జనసేన పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ, పార్టీ కోసం పని చేయటానికి ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాల్లో ఉంటానని, ప్రజా సమస్యలపై పోరాడతానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.