భూ వ్యవహారాలపై న్యాయ దర్యాప్తు

Published: Thursday May 30, 2019
రాజధాని అమరావతిలో భూ వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరపనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసే ప్రసంగంలో వైఎస్‌ జగన్మోహనరెడ్డి దీనిపై ప్రకటన చేస్తారని తెలిసింది. à°† వెంటనే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ప్రభుత్వ అధికారులు కలుసుకొని, న్యాయ విచారణ కోసం సిట్టింగు న్యాయమూర్తిని కేటాయించాలని కోరనున్నారు. అమరావతి కోసం జరిపిన భూసమీకరణ తదితర అంశాలపై వివరాలను ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులు ఇప్పటికే సీఆర్డీయే అధికారులను కోరారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల పరిధిలో కొందరు సీఆర్డీయే, రెవెన్యూ అధికారులు పాల్పడినట్టు చెబుతున్న అవకతవకలకు సంబంధించిన అంశాలపై నివేదిక కోరినట్టు సమాచారం. à°ˆ మేరకు నివేదికను సిద్ధం చేసే పనిలో సీఆర్డీయే అధికారులు తలమునకలయి ఉన్నారు.
 
ఈ అంశాలపై వివరాలివ్వండి..
  • నిడమర్రులోని సీఆర్డీయే లోకల్‌ కాంపిటెంట్‌ అథారిటీ కార్యాలయంలో గతంలో విధులు నిర్వర్తించిన à°’à°• అధికారిణి à°† సమయంలో అక్కడి చెరువులోని కొంత భూమిని తమ పిల్లలు కొనుగోలు చేసి, పూలింగ్‌కు ఇచ్చినట్లు చూపారని వార్తలొచ్చాయి. దీనిపై సీఆర్డీయే ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. రోజుల వ్యవధిలోనే విచారణ నివేదిక ఇచ్చినా, సదరు అధికారిణిని బదిలీ చేయడంతో సరిపుచ్చారు!
  • మందడంలో అసలు భూమే లేని à°’à°• వ్యక్తి దానిని అమరావతి కోసం పూలింగ్‌కు ఇచ్చినట్లుగా రికార్డుల్లో నమోదు చేసి, బదులుగా రిటర్నబుల్‌ ప్లాట్లను అధికారులు కేటాయించారు. ఇది వెలుగు చూడడంతో విచారణ పేరిట కొన్నాళ్లు హడావిడి చేసి, ఒకరిద్దరు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై కేసులు నమోదు చేయించి, చేతులు దులుపుకున్నారు.
  • బోరుపాలెం, మందడం, వెంకటపాలెం తదితర నదీతీర గ్రామాల్లో కొందరు రైతులకు చెందిన మెట్ట భూములను జరీబుగా చూపి, ఎకరాకు 1450 చదరపు గజాల ప్లాట్లను కట్టబెట్టారు. తద్వారా ఎకరాకు 200 à°š.à°—. చొప్పున అధికంగా ఇచ్చి, ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు.
  • లింగాయపాలెం, రాయపూడి తదితర గ్రామాల్లో అసైన్డ్‌, లంక భూములకు పూలింగ్‌ ప్యాకేజీ అమలులో వివక్ష ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదులపై స్పందించలేదు.
  • నేలపాడు, యర్రబాలెం, తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లో కొందరు చెరువులు, ప్రభుత్వ భూములను తమవిగా చూపి, పూలింగ్‌కు ఇస్తే క్షేత్రస్థాయి నిర్ధారణ జరపకుండానే ఎల్పీఎస్‌ ప్యాకేజీలను వర్తింపజేశారు. పలుకుబడి కలిగిన కొందరికి భూములే లేకున్నా, ఉన్నట్లు రికార్డులు సృష్టించి, నాలుగేళ్లుగా భూసమీకరణ ప్రయోజనాలు, ప్లాట్లను కల్పిస్తున్నారు.
  • తుళ్లూరు, వెలగపూడి, నీరుకొండ తదితర గ్రామాలకు చెందిన కొందరు రాజకీయ ప్రముఖులకు చెందిన భూములను పెద్ద విస్తీర్ణంలో గ్రామ కంఠాలుగా గుర్తించి, పూలింగ్‌ నుంచి మినహాయింపునిచ్చిన అధికారులు అసలైన గ్రామకంఠం భూములను మాత్రం అలా గుర్తించలేదు. పలు సమావేశాలు, గ్రామసభల్లో ఎన్నోసార్లు à°ˆ అంశం ప్రస్తావనకు వచ్చినప్పటికీ తీసుకున్న చర్యలేమీ లేవు!
  • రాజధాని వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించి, అవినీతి అధికారులుగా పేరుపడిన కొందరికి రిటైర్మెంట్‌ అనంతరం సీఆర్డీయేలోనే ‘పునరావాసం’ కల్పించారు.