సీఎం జగన్‌కు టీడీపీ లేఖ?

Published: Wednesday June 05, 2019

అమరావతి: à°‰à°‚డవల్లిలో చంద్రబాబు నివాసాన్ని ఆనుకుని ఉన్న ప్రజా వేదిక భవనాన్ని ఆయన నివాస భవనంగా వినియోగించుకోవడానికి అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాలని టీడీపీ సమావేశం నిర్ణయించింది. చంద్రబాబు ప్రస్తుతం à°’à°• ప్రైవేటు భవనంలో ఉంటున్నారు. ఆయన దానికి ప్రతి నెలా అద్దె చెలిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయనకు నివాస భవనాన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ప్రజా వేదిక భవనాన్ని ఇస్తే సౌకర్యంగా ఉంటుందని, దీనిని ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి లేఖ పంపాలని నిర్ణయించారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమ నిర్మించిన పార్టీ కార్యాలయం విశాలంగా ఉన్నందున.. పార్టీ రాష్ట్ర కార్యాలయం పూర్తయ్యేవరకూ దానిని వినియోగించుకోవడంపై ఆలోచన చేయాలని నిశ్చయించారు.