నేడు సీఎస్‌ ఉన్నతస్థాయి సమావేశం

Published: Monday June 10, 2019

 à°°à°¾à°·à±à°Ÿà±à°° ఎక్సైజ్‌ నూతన కమిషనర్‌à°—à°¾ à°Žà°‚.à°Žà°‚.నాయక్‌ ఆదివారం విజయవాడలోని కమిషనర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. à°ˆ సందర్భంగా కార్యాలయ అధికారులు, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన అధికారులతో నూతన ఎక్సైజ్‌ నూతన పాలసీపై సమావేశమయ్యారు. నూతన పాలసీ కసరత్తులో భాగంగా తమిళనాడు, కేరళ రాష్ర్టాలకు అధ్యయనానికి వెళ్లొచ్చిన అధికారులు అక్కడి పరిస్థితులు వివరించారు. రాష్ట్రంలో మద్య నిషేధంపై జగన్‌ హామీ నేపథ్యంలో కొత్త పాలసీపై అధికారులు రెండు ప్రతిపాదనలు చేస్తున్నారు. మద్యం అమ్మకాల్లో అక్రమాల నియంత్రణకు ప్రభుత్వ షాపులను నిర్వహించడం ఒకటైతే, ఏటా కొన్ని షాపులను తగ్గించుకుంటూ ఐదేళ్లలో నిషేధం అమలు చేయాలనేది రెండో ప్రతిపాదన. కాగా నూతన పాలసీపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది.