తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్‌ హెచ్చరిక

Published: Thursday June 13, 2019
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును శిరసావహిస్తున్నామని, అధికారం వచ్చింది కదా అని హద్దు మీరి వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడడం మంచి పద్ధతి కాదని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ హెచ్చరించారు. సత్యనారాయణపురంలోని పంతులుగారి షెడ్‌ రోడ్‌లో టీడీపీ నియోజకవర్గ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో కలిసి బుధవారం అవినాష్‌ ప్రారంభించారు. అనంతరం విలేకర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ప్రజలు వైసీపీకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యాలయాన్ని సత్యనారాయణ పుురంలో తాత్కాలికంగా ఏర్పాటు చేశామని కొన్ని రోజుల్లో ఏలూరురోడ్‌లో కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు.
 
త్వరలో జరుగనున్న పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీ తన సత్తా చూపుతుందని దేవినేని అవినాష్‌ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు.
 
వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిందని అవి అమలు చేస్తే సంతోషమన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు మురళి, తూర్పుకృష్ణా జిల్లా ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ శివ రామకృష్ణ(à°šà°‚à°Ÿà°¿), మునిసిపల్‌ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ రామశాస్త్రులు, కొల్లి వెంకట కృష్ణారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు గోర్జి సత్యనారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.