కేసుల నుంచి తప్పించుకునేందుకే పార్టీ మారారు

Published: Friday June 21, 2019

 à°•à±‡à°¸à±à°² నుంచి తప్పించుకునేందుకే సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్‌, గరికపాటి పార్టీ ఫిరాయించారని మంత్రి శంకర్‌ నారాయణ అన్నారు. సుజనా, సీఎం రమేష్‌.. చంద్రబాబు బినామీలని చెప్పారు. చంద్రబాబు అంగీకారంతోనే వీరంతా పార్టీ మారారని తెలిపారు. త్వరలోనే పలువురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడతారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ భూస్థాపితం అవుతుందని జోస్యం చెప్పారు. ఏపీకి హోదా కోసం జగన్ ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నారని గుర్తుచేశారు. జగన్‌ నాయకత్వంలో తప్పకుండా ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.