టీడీపీ నాయకులు బీజేపీలో చేరుతున్నారు’

Published: Saturday June 22, 2019
తెలుగుదేశం పార్టీ ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఆవిర్భావం జరిగిందో వాటిని చంద్రబాబు నాశనం చేశారని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ దియోదర్‌ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీనగర్‌లోని కందుకూరి కల్యాణ మండపంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. à°ˆ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు యోగాసనాలు వేశారు. à°ˆ సందర్భంగా సునీల్‌ దియోదర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను ప్రజలకు చేరకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
 
తెలుగు ప్రజల అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమని, అందుకే టీడీపీలో ఉన్న నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ à°’à°• ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందన్నారు. నరేంద్ర మోదీ వల్ల యోగాకు అంతర్జాతీయ ప్రాచుర్యం లభించిందన్నారు. శారీరక రుగ్మతలు, రోగాలు యోగా వల్ల తగ్గుతాయన్నారు. à°ˆ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, పాకలపాటి సన్యాసిరాజు, నగర అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌, సత్యమూర్తి, వంగవీటి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.