టీడీపీ ఎంపీలను చేర్చుకోవడంపై జీవీఎల్‌

Published: Sunday June 23, 2019

 ‘ధర్మ సంస్థాపన కోసం భగవంతుడే కొన్నింటిని చూసీ చూడనట్లు ప్రవర్తించాడు.. ఇక మేమెంత!’ అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ మొన్నటి వరకు సుజనా చౌదరిపై ఆరోపణలు చేసి.. బీజేపీలో ఎలా చేర్చుకున్నారన్న ప్రశ్నకు జీవీఎల్‌ à°ˆ విధంగా స్పందించారు. గుంటూరులో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘దేశ అభివృద్ధికి అవసరమైన బిల్లులు రాజ్యసభలో ఆమో దం పొందడం లేదు. వాటిని పాస్‌ చేసుకునేందుకు రాజ్యసభలో బలం పెంచుకుంటున్నాం. బీజేపీలో చేరినంత మాత్రాన టీడీపీ నుంచి వచ్చిన రాజ్యసభ సభ్యులు సచ్ఛీలురు అని అనడం లేదు. 2024 నాటికి తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళలో కూడా బలపడి 350 లోక్‌సభ సీట్లు సాధనే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది’ అని జీవీఎల్‌ పేర్కొన్నారు.