అవినీతిపారుదల గుట్టు తేల్చాలి: సీఎం

Published: Sunday June 23, 2019
నీటి పారుదల ప్రాజెక్టులన్నీ అవినీతి పారుదల ప్రాజెక్టులుగా మారాయని, తక్షణం వాటిని సమీక్షించాలని నిపుణుల కమిటీని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. అవినీతిలో మన రాష్ట్రం నంబర్‌వన్‌ అని దేశం మొత్తం మాట్లాడుకునే పరిస్థితి à°—à°¤ ప్రభుత్వం వల్ల వచ్చిందని, à°ˆ అంశాన్ని వదిలేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. సాగునీటి రంగంలో ప్రభుత్వం ఇటీవల నియమించిన నిపుణుల కమిటీతో శనివారం సీఎం సమీక్ష నిర్వహించారు. రూ.100 వస్తువు రూ.80కే వస్తుంటే, ఎవరైనా రూ.100à°•à°¿ కొంటారా అని à°ˆ సందర్భంగా జగన్‌ ప్రశ్నించారు.
 
‘‘ప్రాజెక్టుల్లో భారీగా అవినీతి, దోపిడీ జరిగాయి. ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే అనేక కుంభకోణాలు జరిగాయి. కాబట్టి, నిపుణుల కమిటీ తొలుత పోలవరం ప్రాజెక్టుపై దృష్టిపెట్టాలి. à°† తర్వాత గృహనిర్మాణం, గాలేరు నగరి, హంద్రీ నీవా, వంశధార ప్రాజెక్టుల్లోని అక్రమాలు, అవకతవకలను వెలికితీయాలి. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ధనాన్ని మిగుల్చుకోవాల్సిన అవసరం ఉంది. à°ˆ టెండరింగ్‌ ద్వారా ఏఏ పనుల్లో నిధులు ఆదా చేయగలమో గుర్తించండి. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రజాధనాన్ని మిగిల్చిన అధికారులను సన్మానిస్తాం’’ అని సీఎం ఆదేశించారు. కమిటీకి ఆర్థికంగా, సాంకేతికంగా సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.