రుణం చెల్లించలేదని పింఛన్‌ను నిలిపివేశారు.

Published: Friday July 05, 2019

తీసుకున్న పంట రుణం చెల్లించలేదని లబ్దిదారుల పింఛన్‌ను బ్యాంకు అధికారులు నిలిపివేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దాచారం గ్రామానికి చెందిన కుందేటి ఎల్లవ్వ(వితంతువు) బెజ్జంకి ఆంధ్రా బ్యాంకు శాఖలో రూ.లక్ష రుణం తీసుకుంది. తన పేరిట ఉన్న ఖాతాలో జమ అయిన పింఛను డబ్బులు తీసుకుందామని గురువారం బ్యాంకుకు వెళ్లిన ఆమెకు అధికారులు టోకెన్ ఇచ్చారు. టోకెన్ తీసుకుని డబ్బులు తీసుకుందామని క్యాష్ కౌంటర్ వద్ద నిలుచున్న ఎల్లవ్వకు ‘నీ పేరిట పంట రుణం ఉంది. దానిని రెన్యువల్ చేసే దాకా నీకు పింఛను డబ్బులు ఇవ్వడం కుదరదు’ అని ఇచ్చిన టోకెన్‌ను వెనక్కి తీసుకున్నారు.