అరబిందో ఫార్మాలో ప్రమాదం

Published: Sunday August 11, 2019

జిల్లాలోని రణస్థలం మండలం పైడిభీమవరంలోని అరబిందో ఫార్మాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మాలో ఒక్కసారిగా బాయిలర్‌ పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులను రాహుల్‌, రాజారావుగా గుర్తించారు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అసలేం జరిగిందని ఆరాతీస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫ్యాక్టరీ గేటు ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇంతవరకూ à°ˆ ప్రమాదంపై అరవిందో ఫార్మా సిబ్బంది స్పందించకపోవడం గమనార్హం.