ట్రాఫిక్ పోలీసులు పనికి.. ఖంగుతిన్న వాహనదారుడు

Published: Monday August 19, 2019
శ్రీకాకుళం నగరంలో రోజురోజుకీ ట్రాఫిక్‌ పెరిగిపోతోంది. ఓవైపు పెద్దపెద్ద వస్త్ర దుకాణాల సందడి, మరోవైపు ఫుట్‌పాత్‌ వ్యాపారుల హడావుడితో ప్రధాన వీధులన్నీ నిత్యం రద్దీగా కనిపిస్తున్నాయి. వాహనాల పార్కింగ్‌ కోసం డివైడర్‌ మధ్యలో స్థలాన్ని కేటాయించినా చాలని దుస్థితి నెలకొంది. అయితే ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన శ్రీకాకుళం నగర పోలీసులు.. వాహనదారులకు హెచ్చరికలు జారీచేయకుండానే అపరాధ రుసుం వసూలు చేయడం చర్చనీయాంశమవుతోంది.
 
కొందరు పోలీసులు తమ టార్గెట్లు పూర్తి చేసుకోవడానికి చాటుమాటున వాహనాల ఫొటోలు తీసి.. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. దీంతో వాహనచోదకులకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ తప్పేమిటో తెలియకుండానే ‘à°ˆ చలానా’ రూపంలో జరిమానాలను చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం ఆగస్టు ఒకటో తేదీ నుంచి నగరంలో కూడా హెల్మెట్‌ పెట్టుకోవాలని అధికారులు ఆదేశించారు. అయితే à°ˆ దిశగా ఎక్కడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించలేదు. ట్రాఫిక్‌ పోలీసులు వారికి నచ్చిన రీతిలో వాహనదారులపై బలవంతంగా జరిమానాలు రుద్దుతున్నారు. దీని కోసం చాటుమాటుగా, షాపుల పక్కన, వాహనాల వెనుక దిశ నుంచి(చోదకునికి తెలియకుండా) ఫొటోలు తీస్తున్నారు.
 
ఉదయం 9 à°—à°‚à°Ÿà°² నుంచి 11 à°—à°‚à°Ÿà°² వరకు నగరంలోని పాత బస్టాండ్‌ జంక్షన్‌ వద్ద à°“ సెల్‌షాపు వద్ద పోలీసులు చోదకులకు కనపడకుండా నిల్చొని ఫొటోలు తీస్తున్నారు. ఇదే సమయంలో వాహనదారులకు అసలు ఇక్కడ చెకింగ్‌ అవుతుందన్న విషయం తెలియడం లేదు. అసలు హెల్మెట్‌ కోసం పోలీసులు ఒకసారి పత్రిక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కనీసం సిగ్నల్స్‌ వద్ద మైకులో కూడా ప్రచారం చేయడం లేదు. పైగా షాపుల మూలన నిల్చుని, వెనుక నుంచి చెప్పకుండా ఫొటోలు తీసి చోదకుడి జేబుకు చిల్లు పెడుతున్నారు. ‘à°ˆ చలానా’ రూపంలో అపరాధ రుసుం చెల్లించాలని సమాచారం అందినప్పుడు వాహనదారులు అవాక్కవుతున్నారు. అయితే ఇదెంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
 
శ్రీకాకుళంలో గుజరాతీపేటకు చెందిన à°“ వ్యక్తి తన ద్విచక్రవాహనంపై ఈనెల 14à°¨ ఉదయం 9.45 గంటలకు పాతబస్టాండ్‌ మీదుగా అరసవల్లి వెళ్లాడు. అయితే à°† వ్యక్తి పేరున అదే రోజు మధ్యాహ్నం 1.41 గంటలకు పేరులేని రోడ్డు, ఎల్‌బీఎస్‌ కాలనీ, శ్రీకాకుళం అని పేర్కొని ట్రాఫిక్‌ పోలీసులు ‘à°ˆ-చలానా’ వేశారు. అది కూడా సదరు ద్విచక్ర వాహనదారుడుకి తెలియదు. తర్వాత దీనిపై సమాచారం అందగా, పోలీసులను సంప్రదించాడు. ‘మీ-సేవ’లో చలానా కట్టాలని వారు ఆదేశించగా.. అసలు తన తప్పేంటో తెలుసుకోవాలని సదరు వాహనదారుడు ‘మీ-సేవ’లో చలానా వివరాలను సరిచూసుకున్నాడు. కాగా వాహనానికి వెనుక నుంచి తీసిన ఫొటో, సమయం, ప్రాంతం తప్పుగా నమోదు చేసి à°ˆ చలానా వేసినట్టు గుర్తించాడు. à°ˆ సంఘటనతో వాహనదారుడు విస్మయం చెందాడు. అసలు తనకు తెలియకుండా ‘à°ˆ-చలానా’ వేయడంపై ‘ఆంధ్రజ్యోతి’à°•à°¿ సమాచారం అందించాడు. సదరు వ్యక్తి మాట్లాడుతూ à°ˆ విషయంపై న్యాయస్థానానికి వెళ్తానని చెప్పాడు. పోలీసులు షాపుల మూల నుంచి ఫొటోలు తీస్తున్న విషయం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని తెలిపాడు.