విద్యాసంస్థలకు.. నాలుగు రోజుల సెలవు

Published: Friday August 23, 2019
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక పరీక్షల నేపథ్యంలో వచ్చే నెలలో పరీక్షాకేంద్రాలుండే విద్యాసంస్థలకు నాలుగు రోజుల పాటు లోకల్‌ హాలిడేస్‌ ప్రకటించారు. à°ˆ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జీవో 544 విడుదల చేశారు. వచ్చేనెల 1నుంచి 8à°µ తేదీ వరకూ సచివాలయ పరీక్షలు నిర్వహించనున్నారు. 1à°µ తేదీ, 8వతేదీ రెండు ఆదివారాల్లో పరీక్షలు జరగనున్నాయి.
 
అయితే 3,4,6,7 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ముఖ్యంగా జిల్లావ్యాప్తంగా పలుకళాశాలలు, పాఠశాలల్లో పరీక్షాకేంద్రాలు ఏర్పాటుచేశారు. అలాగే పరీక్షలకు లక్షలాది మంది హాజరవుతున్న నేపథ్యంలో ఆయా తేదీల్లో పరీక్షాకేంద్రాలుగా గుర్తించిన వాటికి స్థానిక సెలవులుగా ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.