ఒక్కో సినిమాకు ఒక్కో ధర వద్దు... సీఎం జగన్‌

Published: Thursday August 29, 2019

సాహో సినిమా టికెట్ల ధరను పెంచేందుకు అనుమతించడంలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సాహో సినిమా టికెట్ల ధర పెంపు అంశాన్ని అధికారులు సీఎం జగన్మోహనరెడ్డి వద్ద ప్రస్తావించినప్పుడు.. ఆయన సుముఖత చూపలేదని తెలిసింది. ఒక్కో సినిమాకు ఒక్కో ధర వద్దని సీఎం జగన్‌ అధికారులకు సూచించినట్లు సమాచారం. దీంతో.. సాహో సినిమా టికెట్ల ధరపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రభుత్వ విధానం అన్ని సినిమాలకూ ఒకేలా ఉంటుందని స్పష్టం చేసింది.