వీఆర్వో కాలర్‌ పట్టుకొని మరీ..

Published: Friday August 30, 2019
 à°­à±‚ సమస్యను పరిష్కరించాలంటూ వీఆర్వో చుట్టు తిరిగీ తిరిగీ à°† మహిళా రైతుకు ఓపిక నశించింది. నువ్వు అడిగినన్ని పైసలిచ్చి.. ఏడాదిగా తిరుగుతున్నా.. నా సమస్యను పట్టించుకోవా? అంటూ వీఆర్వోను కాలర్‌ పట్టుకొని కార్యాలయం నుంచి బయటకు లాక్కొచ్చి మరీ నిలదీసింది.
 
సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండల తహసిల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం జరిగిందీ ఘటన. బాధితురాలు మేడుకుంద గ్రామానికి చెందిన పోచమ్మ. తన పేరిట ఉన్న పట్టా భూమిని కొడుకుల పేరుమీద రాశారనేది ఆమె ఫిర్యాదు. కాగా కాలర్‌ పట్టుకున్న పోచమ్మను à°† వీఆర్వో తోసేయడంతో కిందపడి స్పృహకోల్పోగా ఆస్పత్రికి తరలించారు.