బోటు వెలికితీతకు మరో ప్రయత్నం

Published: Sunday October 13, 2019

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటును వెలికితీసేందుకు మరోసారి ప్రయత్నించనున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ధర్మాడి సత్యం బృందం బోటు వెలికితీత పనులు చేస్తుందని చెప్పారు. వారం క్రితమే బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించగా.. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం గోదావరి నది నిలకడగా ఉంది. దీంతో బోటును వెలికితీసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రేపు కచ్చులూరు దగ్గర సెర్చ్ ఆపరేషన్ చేపట్టనున్నట్లు కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు.