వంశీని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు!

Published: Monday October 28, 2019
కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ à°† పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విదితమే. à°ˆ క్రమంలో ఆయన్ను బుజ్జగించడానికి ఎంపీ కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దింపారు. సుమారు గంటపాటు వంశీతో చర్చించిన అనంతరం ఎంపీ కేశినేని నాని ఏబీఎన్‌తో మాట్లాడారు. వంశీ చేసిన పోరాటాలు పార్టీ గుర్తుపెట్టుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం మోపుతున్న కేసుల గురించి వంశీ బాధపడుతున్నారన్నారు.
 
నిజమైన ప్రజాసేవ చేసినవారికి à°† ఎమోషన్‌ ఉంటుంది. జగన్‌ను వంశీ కలిసింది ప్రజా సమస్యల కోసమేనని భావిస్తున్నాం. పార్టీ నిర్ణయానికి వంశీ ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు. వంశీతో మాట్లాడాలని నాకు, కొనకళ్లకు చంద్రబాబు సూచించారు. వంశీని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు. వంశీతో మాట్లాడి సహేతుకమైన ముగింపును ఇస్తాం à°…ని కేశినేని నాని ఏబీఎన్‌తో చెప్పారు.