ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు విజయసాయిరెడ్డి.

Published: Sunday November 10, 2019
 à°†à°‚ధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ-వైసీపీ నేతల మధ్య మొదలైన ట్వీట్ల యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. అటు వైసీపీ నేతలు ట్వీట్స్ చేయడం.. తెలుగు తమ్ముళ్లు కౌంటర్లివ్వడం.. మళ్లీ కౌంటర్ ఎటాక్ చేయడం జరుగుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి సంచలన ట్వీట్స్ చేశారు. బుద్దా చేసిన à°ˆ ట్వీట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
 
"ఇప్పటి వరకూ మేము శుక్రవారం ముఖ్యమంత్రి అనుకున్నాం కానీ మీరే స్వయంగా ఆయన మంగళవారం ముఖ్యమంత్రి అని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. హామీలు నెరవేర్చే దమ్ము లేక ‘రాష్ట్రం అప్పుల్లో ఉంది’ à°…ంటూ దద్దమ్మ కబుర్లు ఎందుకు విజయసాయిరెడ్డి గారు.. చంద్రబాబు గారి హయాంలో చేసిన అప్పు 1,10,000 కోట్లు అంటే ఏడాదికి 22 వేల కోట్లు. ఐదు నెలల మీ జగన్ గారి పాలనలో చేసినవి 18 వేల కోట్లు. పైగా 2019-2020 బడ్జెట్లో సంవత్సరానికి 48 వేల కోట్ల అప్పులు ప్రతిపాదించారు. ఇప్పుడు చెప్పండి లెక్కల మాస్టారు.. ఎవరు ఎక్కువ అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. మీ దొంగ మొహాలు చూసి బ్యాంకులు ఛీ అంటున్నా.. నవ్వి పోదురు గాక నాకేంటి సిగ్గు నేను రాసిన తప్పుడు లెక్కే నిజం అంటారా విజయసాయిరెడ్డి గారు?" à°…ని వైసీపీ ఎంపీపై బుద్దా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ట్వీట్ చేశారు.