పెదనాన్నా అంటూ వచ్చిన ఎనిమిదేళ్ల పాపపై ఘోరం

Published: Tuesday November 12, 2019
ఎదురింటివాడే యముడయ్యాడు. ‘నోరారా పెదనాన్నా’ అని పిలిపించుకున్నవాడే చిన్నారిని చిదిమేశాడు. తన చేతుల్లో రోజూ ఆడుకొనే పాపాయిపైనే కనికరం లేకుండా అత్యాచారం జరిపి, ఆపై అమానుషంగా హత్య చేశాడు. మధ్యాహ్నం వరకు తన పక్కనే నిద్రపోయిన చిన్నారి సాయంత్రం నుంచి మాయమయి, చివరకు ఛిద్రమై కనిపించేసరికి పాప తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం నల్లకుంట గ్రామంలో జరిగిన à°ˆ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం, మొవ్వా అనిల్‌ అలియాస్‌ ఏసుపాదం గొల్లపూడిలో ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు. ఆయన భార్య వెంకటరమణ ఇంటికి సమీపంలోని à°“ కళాశాలలో పనిచేస్తోంది. à°ˆ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, à°’à°• అమ్మాయి ఉన్నారు.
కుమార్తె వయసు ఎనిమిదేళ్లు. నల్లకుంటలోని à°“ కాన్వెంట్‌లో రెండో తరగతి చదువుతోంది. ఆదివారం ఉదయం వెంకటరమణ కళాశాలలో ఉద్యోగానికి వెళ్లిపోయింది. ఏసుపాదం ఒక్కడే ఇంటి వద్ద ఉన్నాడు. అతడు మధ్యాహ్నం భోజనం చేసి నిద్రపోయాడు. పాప తండ్రి పక్కనే కొద్దిసేపు పడుకొని సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చింది. కాలేజీలో పనిచేసి తిరిగొచ్చిన వెంకటరమణకు కుమార్తె కనిపించకపోవడంతో భర్తను నిద్ర లేపింది. వారిద్దరూ కలిసి చుట్టుపక్కల à°Žà°‚à°¤ గాలించినా పాప జాడ దొరకలేదు. తమ కుమార్తె అదృశ్యంపై వారు భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని నల్లకుంట గ్రామం వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినా, పోలీసులు చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారు. మరోవైపు పాప తల్లిదండ్రులు తమ చుట్టుపక్కల ఉన్న అన్ని ఇళ్లకు వెళుతూ, ఆరా తీయడం మొదలుపెట్టారు. à°ˆ క్రమంలో సోమవారం సాయంత్రం వారి ఇంటికి ఎదురుగా ఉన్న ప్రకాశ్‌ ఇంట్లోనే నాటకీయంగా పాప మృతదేహం బయటపడింది. à°’à°• గోనెసంచిలో విగతజీవిలా పడిఉన్న చిన్నారిని చూసి వారు గుండెలు బాదుకొన్నారు. అప్పటిదాకా పాపను తమతో పాటు వెతికిన ప్రకాశే హంతకుడని తెలుసుకొని నివ్వెరపోయారు.