సైకోయిజం రాజ్యమేలుతోంది

Published: Saturday November 23, 2019
సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ను సూసైడ్‌ ఆంధ్రగా మార్చిన ఘనత ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానిదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. హత్యాయత్నం కేసులో నిందితులుగా ఉన్న గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలేనికి చెందిన టీడీపీ నాయకులు కుమ్మెత కోటిరెడ్డి, శివారెడ్డి తదితరులను శుక్రవారం నరసరావుపేట సబ్‌ జైలులో లోకేశ్‌ పరామర్శించారు. అనంతరం అక్కడ, మంగళగిరిలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో సైకోయిజం రాజ్యమేలుతుందన్నారు. ‘ఇతర పార్టీల వారిని మానసికంగా దెబ్బతీసే విధంగా అక్రమ కేసులు బనాయించడం, దాడులు చేయడం, ఆత్మహత్యలకు ప్రేరేపించడం, జీవనోపాధి లేకుండా చేయడం మొదలైనవాటితో ఆయా పార్టీల కార్యకర్తలను వైసీపీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు.
 
 
జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 640 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు. అనేక మందిపై దాడులు చేశారు. కొందరిని హత్య కూడా చేశారు. మా కార్యకర్తలపై కొందరు పోలీసు అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అక్రమ కేసులు బనాయించిన అధికారులపై ప్రైవేట్‌ కేసులు దాఖలు చేయిస్తాం. కార్యకర్తలకు పూర్తిగా à°…à°‚à°¡à°—à°¾ ఉంటాం’ అని స్పష్టం చేశారు. ‘నాకు రాజధానిలో 500 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. à°ˆ ఆరు నెలల కాలంలో అరసెంటు భూమి ఉందని కూడా నిరూపించలేకపోయారు. టీడీపీ హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పో.. పో అంటూ ఛీదరించుకుంటున్నారు. తెలంగాణ పాలకులు à°°à°¾.. à°°à°¾ అంటూ వాటిని తీసుకుపోతున్నారు’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.