పోలీసులు కూడా అవాక్కయారు

Published: Monday November 25, 2019

తాడేపల్లి పట్టణంలో పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేశారు. జూదరులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో కొత్తేముంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అక్కడ పేకాడుతూ పట్టుబడిన వారందరూ మహిళలే. జూదం కూడా లక్షలో జరుగుతోంది. దాడి చేసిన పోలీసులు కూడా అవాక్కయారు. పట్టణంలోని మహానాడు పట్టాభి రామయ్య కాలనీ ప్రాంతంలోని à°“ ఇంట్లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తాడేపల్లి సీఐ అంకమ్మరావు మహిళా పోలీసులతో కలసి ఆదివారం రాత్రి దాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి లక్షా 36 వేల 250 రూపాయల నగదును, 8 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.